వాహనదారులకు హెల్మెట్ ధరించడం పై అవగాహన కార్యక్రమం

On

4a50f302-c884-4f4c-a1fa-51f2696bfc0fహెల్మెట్ ధరించడం పై అవగాహన కార్యక్రమం 

   కర్నూలు నంది పత్రిక......  కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్  , కర్నూల్ డిఎస్పి బాబు ప్రసాద్ ఉత్తర్వుల మేరకు కర్నూల్ ట్రాఫిక్ సిఐ మన్సరుద్దీన్  ఆధ్వర్యంలో, ట్రాఫిక్ ఎస్ఐ వెంకటేశ్వర్లు , ఆర్ ఎస్ ఐ Md హుస్సేన్  మరియు ట్రాఫిక్ సిబ్బంది సోమవారం  సాయంత్రము 5 .3 0 గంటల సమయంన కర్నూలు సి క్యాంప్ సెంటర్లో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధరించడం పై అవగాహన కార్యక్రమం  నిర్వహించి, ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధరించడం వలన కలుగు లాభములు మరియు నష్టంల గురించి అవగాహన కల్పించడమైనది. ద్విచక్ర వాహనంపై   వెళ్లినప్పుడు వాహనం నడిపే వ్యక్తితో పాటు వెనుక కూర్చున్న వ్యక్తి కూడా కచ్చితంగా హెల్మెట్ ధరించవలెను. హెల్మెట్ ధరించడం వలన ఆక్సిడెంట్ జరిగిన సమయంలో ప్రాణాపాయం నుండి రక్షించుకోగలమని, నిర్లక్ష్యం వలన ఊహించని ప్రాణ నష్టం జరుగునని తెలుపడం అయినది. 01.03.2025 వ తేది నుండి అమలులోకి వచ్చిన సవరించిన నూతన మోటారు వాహనాల చట్టం ప్రకారము హెల్మెట్ ధరించని ఎడల భారీ జరిమానాలు వేయవలసి ఉంటుంది.ఈ హెల్మెట్ అవగాహన కార్యక్రమమునకు స్పందించిన సుమారు 90 మంది ద్విచక్ర వాహనదారులు నూతన హెల్మెట్స్ తెచ్చుకొని ధరించుకొని వెళ్లడమైనది.

Tags:

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

రూ. 2.5 కోట్ల విలువగల 72 ఎర్రచందనం దుంగలు స్వాధీనం రూ. 2.5 కోట్ల విలువగల 72 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
    ఏడుగురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్ ఒక లారీ, మరో కారును స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ తిరుపతి చీఫ్ బ్యూరో ఏప్రిల్ 28 నంది పత్రికతిరుపతి
కర్నూలు ఆర్టిసి డిపో మేనేజర్ ఇంట్లో చోరీ కేసును చేధించిన కర్నూలు త్రీ టౌన్ పోలీసులు....
భూ నిర్వాసితులకు శాశ్వత ఉద్యోగాలు కల్పించాలి 
మేడే ను జయప్రదం చేయండి: సిపిఐ జిల్లా కార్యదర్శి బి.విజయసారథి.
చెంచుల జీవనోపాధిని పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు  
శాంతిరాం సైకియాట్రీ పీజీ విద్యార్థికి   బంగారు పతకం అందజేత
రహదారి ప్రమాదాల నియంత్రణకు సత్వర చర్యలు చేపట్టండి