వర్షాలకు 1000 ఎకరాల్లో వరి పంట నష్టం 

On

GridArt_20250411_192924326

మహానంది, ఏప్రిల్ 11 (నంది పత్రిక):-
మహానంది మండలంలోని తమ్మడపల్లె,బొల్లవరం గ్రామాలలో  గాలి వర్షానికి పడిపోయిన వరి పొలాలను నంద్యాల సహాయ వ్యవసాయ సంచాలకులు రాజశేఖర్ శుక్రవారం సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మహానంది మండలంలో రబీ సీజన్లో 7,100 ఎకరాలలో వరి పంట సాగు చేయడం జరిగిందన్నారు.దాదాపు 4 వేల ఎకరాలకు పైగా వరి కోతలు పూర్తి అయ్యాయని తెలిపారు.1000 ఎకరాలు గాలి,వానకు వరి పంట పడిపోయినట్లు ప్రాథమికంగా అంచనా వేయడం జరిగిందని,పంట నష్టం అంచనా ప్రాథమిక నివేదికను ఉన్నత అధికారులకు పంపడం జరుగుతుందన్నారు.రైతులు పొలంలో ఉన్న నీటిని కాలువల ద్వారా వెంటనే తొలగించాలని,అదేవిధంగా కట్టలు కట్టుకోవాలని సూచించారు.గింజ గట్టిపడిన పంటపై మొలకలు రాకుండా, ఐదు శాతం ఉప్పు ద్రావణం పిచికారి చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి బి.నాగేశ్వర రెడ్డి,గ్రామ వ్యవసాయ సహాయకులు మధు,రైతులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

మంత్రుల పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ మంత్రుల పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్
      ములుగు జిల్లా బ్యూరో : ఏప్రిల్ 17( నంది పత్రిక ) భూభారతి పోర్టల్ పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఫైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికైన
పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా ప్రోత్సహించండి
ప్లేస్‌మెంట్‌లో పెద్ద విజయం – నేషనల్ డిగ్రీ కళాశాల నుంచి 70 మంది మల్టీనేషనల్ కంపెనీలకు ఎంపిక
సంస్కరణల మధ్య ఆధునికతకి మరో అడుగు  – ఎఐఎంఎల్ ల్యాబ్ ప్రారంభం
గుడుంబా స్థావరాలపై దాడులు చేసిన ములుగు పోలీస్ 
డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ కి ఘన నివాళి
డా.బి.ఆర్.అంబేద్కర్ ఆశయాలను యువత స్పూర్తిగా తీసుకోవాలి