కీసరలో మహాశివరాత్రి సందర్భంగా శివపంచాక్షరి స్తోత్ర పారాయణం
On
కీసర, నంది పత్రిక ఫిబ్రవరి 26 :
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కీసర శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో సుధా స్వామి బృందం బుధవారం గ్రహ దోష నివారణార్థం శివుని యొక్క పంచాక్షరి స్తోత్రం పారాయణం చేశారు. శంకరాచార్య కృత శివానంద లహరి గానం ఆలపించారు. సుధా స్వామి బృందం మహిళలు భక్తిశ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొత్త నీలిమ, దుర్గా, సాయి, నాగశ్రీ, హరిణి, పద్మ, శారద, నిర్మల, లక్ష్మీబాయి, తులసి, ప్రవీణ, విజయలక్ష్మి, వసుందర, సుజాత, భారతి, శ్రీనిధి, శాలిని తదితరులు పాల్గొన్నారు.
About The Author
Post Comment
Latest News
11 Mar 2025 22:47:09
-ఎస్సీ, బీసీలకు 50 వేలు, ఎస్టీలకు 75 వేలు, పివిటీజీలకు లక్ష రూపాయలు అదనపు ఆర్థిక లబ్ధి
-జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి గణియా
నంద్యాల ప్రతినిధి. మార్చి...
Comment List