మహానంది పుణ్యక్షేత్రంలో వైభవంగా పుష్ప పల్లకి సేవ 

On

GridArt_20250227_224308964

మహానంది ఫిబ్రవరి 27 (నంది పత్రిక):-
కళ్యాణోత్సవం అనంతరం మహానందీశ్వరుని దంపతులు గురువారం రాత్రి పుష్పపల్లకిలో విహరించారు.ఆలయ ఈవో ఎన్. శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వేద పండితుల రవిశంకర్ అవధాని,రుత్వికులు స్వామివారి దంపతులను ఊరేగింపుగా తీసుకొచ్చి ప్రత్యేకంగా తయారు చేయించిన పుష్పల్లకిలో కొలువు చేశారు.అనంతరం ఆలయ ప్రాంగణంలో స్వామివారికి గ్రామోత్సవం వైభవంగా జరిగింది.చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో దేవస్థాన అధికారులు సిబ్బంది అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News