నంద్యాల ఎస్ డి పి ఐ కార్యాలయంలో ఈ డి సోదాలు - ఏమీ దొరకక ఖాళీ చేతులతో పలయానం చిత్తగించిన ఈ డి అధికారులు

On

GridArt_20250306_225521391

నంది పత్రిక అగ్రికల్చర్ రిపోర్టర్ మార్చి 06:-నంద్యాల ఎస్ డి పి ఐ కార్యాలయంపై ఈ రోజు మధ్యాహ్నం 12:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు Enforcement Directorate (ED) అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల సమయంలో అధికారులు కార్యాలయాన్ని పూర్తిగా పరిశీలించి, డాక్యుమెంట్లు, ఫైనాన్షియల్ లావాదేవీలను సమగ్రంగా పరిశీలించారు.

అయితే, చాలా గంటల పాటు జరిగిన ఈ తనిఖీల్లో ఎలాంటి అక్రమాలు లభించలేదు. దీనితో ఏమీ దొరకక నిరాశచెందిన ED అధికారులు చివరికి కార్యాలయం నుండి వెనుదిరిగారు. ఈ పరిణామం స్పష్టంగా రాజకీయ కక్షతో ప్రేరేపించబడిన చర్య అని ఎస్ డి పి ఐ నాయకులు మజీద్ ఖాన్ అభిప్రాయపడ్డారు.

నంద్యాల అసెంబ్లీ అధ్యక్షులు ఎజాస్ హుస్సేన్ మాట్లాడుతూ ఈ దాడులు అధికార పార్టీ చేతిలో ED ఒక రాజకీయ ఆయుధంగా మారినట్లు స్పష్టంగా చూపిస్తున్నాయి. వప్పు సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఎస్ డి పి ఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్త0గా ప్రజాస్వామ్య బద్దంగా, చేస్తున్న నిరసనలకు భయపడే బిజెపి సంపరివార్ ఈడిని ఉపయోగించుకొని మా ఈ నిరసనలను ఆపాలనుకోవడం వారి మూర్ఖత్వమని తెలిపారు. బిజెపి ప్రభుత్వం చేసే ప్రతి ప్రజావ్యతిరేక పనిని ఎదుర్కోవడంలో ఎస్ డి పి ఐ ముందు వరుసలో ఉంటుందని ఇటువంటి ఈడి , బీడీ దాడులకు భయపడే ప్రసక్తే లేదని తెలిపారు .ఇలాంటి అక్రమ దాడులు ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారతాయి. మేము ఎప్పటికీ చట్టానికి లోబడి, ప్రజా హితాన్ని కాపాడే విధంగా పనిచేస్తాం అని పేర్కొన్నారు

ఎస్ డి పి ఐ – నంద్యాల అసెంబ్లీ

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News