అక్రమంగా తరలిస్తున్న 323 క్వింటాళ్ల 50 కిలోల పిడిఎస్ బియ్యాన్ని పట్టుకున్న పసర పోలీసులు .....
On
ములుగు జిల్లా న్యూస్. గోవిందరావుపేట మండలం, ముద్దులగూడెం శివారులో, ఎస్సై కమలాకర్ , తన సిబ్బందితో పెట్రోలింగ్ చేస్తుండగా గుండాల నుండి మొద్దుల గూడెం వైపు వస్తున్న లారీ, AP16,TE6576, నెంబర్, పైన కవర్ కప్పుకొని నిండుగా లోడుతో వస్తుండటంతో అనుమానం వచ్చిన పోలీసులు లారీని ఆపి తనిఖీ చేయగా దానిలో బియ్యం బస్తాలు ఉండటంతో డ్రైవర్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తన పేరు వల్లేపు బంగారి అని నేను కిరాయికి వెళ్తున్నాను , ఈ బియ్యం బత్తుల రాజు లచ్చగూడెం గ్రామం ఇల్లందు అని ఆయన గ్రామాల్లో తిరుగుతూ తక్కువ ధరకు బియ్యాన్ని కొనుగోలు చేసి ఎక్కువ ధరకు మహారాష్ట్రలోని నాగపూర్ లో అమ్ముతామని తెలిపాడు, ఈ బియ్యం విలువ 6,47,000 రూ లు, అని తెలిపాడు, లారీని అదుపులోకి తీసుకొని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పసర S I, కమలాకర్ తెలిపారు ,
About The Author
Related Posts
Post Comment
Latest News
11 Mar 2025 22:47:09
-ఎస్సీ, బీసీలకు 50 వేలు, ఎస్టీలకు 75 వేలు, పివిటీజీలకు లక్ష రూపాయలు అదనపు ఆర్థిక లబ్ధి
-జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి గణియా
నంద్యాల ప్రతినిధి. మార్చి...
Comment List